నచ్చిన చోట కొలువు కోసం పైరవీలు | - | Sakshi
Sakshi News home page

నచ్చిన చోట కొలువు కోసం పైరవీలు

May 31 2025 12:48 AM | Updated on May 31 2025 12:48 AM

నచ్చిన చోట కొలువు కోసం పైరవీలు

నచ్చిన చోట కొలువు కోసం పైరవీలు

మహారాణిపేట: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గడువు దగ్గర పడుతుండటంతో, తమకు నచ్చిన చోటకు పోస్టింగ్‌ల కోసం పైరవీలు ఊపందుకున్నాయి. కూటమి ప్రజా ప్రతినిధుల సిఫార్సులకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల్లోని కొంతమంది అధికారులు నిమగ్నమయ్యారు. నగరంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నగరంలో పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా భీమిలి, విశాఖ రూరల్‌, ఆనందపురం, పెందుర్తి, సీతమ్మధార తహసీల్దార్‌ పోస్టులకు మంచి డిమాండ్‌ ఉంది. వీటిని పొందేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఆరుగురు సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది.

నిబంధనలివీ..

జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం తెలిసిందే. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి స్థాన చలనం కల్పించాలి. మన్యం ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యమివ్వాలి. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయడమే కాకుండా అన్ని క్యాడర్లు, పోస్టుల్లో చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని, ఎంత కాలం ఒకే ప్రాంతంలో పని చేశారనేది లెక్కించాలి. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారికి, 40 శాతానికి మించి వైకల్యం ఉన్న ఉద్యోగులకు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే బదిలీల్లో ప్రాధాన్యమివ్వాలి.

రెవెన్యూలో సిఫార్సులకే పెద్దపీట?

ఉమ్మడి విశాఖలోని రెవెన్యూ శాఖలో అన్ని క్యాడర్లలో బదిలీలు విశాఖ కలెక్టర్‌ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ చేయాల్సి ఉంది. దీనిపై ఆయన ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కలెక్టర్లతో సమావేశమై చర్చించారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, తహసీల్దార్‌ కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర క్యాడర్ల బదిలీలపై తుది నిర్ణయం విశాఖ కలెక్టర్‌ తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయన కార్యాలయానికి 68 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇవి కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కూడా సిఫార్సు లేఖలు, ఫోన్లు వచ్చినట్లు సమాచారం. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లు విశాఖ జిల్లాలో పోస్టింగ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది నచ్చిన చోట పోస్టింగ్‌ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కూటమి ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

పోస్టు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement