
కేకే లైన్లో రైళ్ల గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: ఆధునికీకరణ పనుల నిమిత్తం కేకే లైన్లో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ● ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నం–కిరండూల్(58501) పా సింజర్ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ● ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ● ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్ప్రెస్ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ● ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ బయల్దేరే కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్ప్రెస్ దంతేవాడ నుంచి బయల్దేరుతుంది.