సింహాచలంలో సమన్వయలోపం! | - | Sakshi
Sakshi News home page

సింహాచలంలో సమన్వయలోపం!

May 7 2025 1:18 AM | Updated on May 7 2025 1:18 AM

సింహాచలంలో సమన్వయలోపం!

సింహాచలంలో సమన్వయలోపం!

ఆర్జిత సేవల రద్దుపై భక్తురాలి ఆగ్రహం

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం ఆర్జిత సేవలను రద్దు చేయడంపై ఓ భక్తురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో శ్రీవైష్ణవ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించినందున ఆలయ వర్గాలు మంగళవారం ఆర్జిత సేవలను నిలిపివేశాయి. అయితే ఈ విషయాన్ని భక్తులకు ముందుగా తెలియజేయడంలో ఆలయ యంత్రాంగం విఫలమైంది. సోమవారం సాయంత్రం సింహగిరిపై ఉన్న పీఆర్వో కార్యాలయానికి ఓ భక్తురాలు ఫోన్‌ చేసి మంగళవారం గరుడ సేవ నిర్వహిస్తారా అని వాకబు చేశారు. సిబ్బంది సేవలు ఉంటాయని సమాధానమిచ్చారు. దీంతో ఆమె మంగళవారం ఉదయం దూర ప్రాంతం నుంచి సింహగిరికి చేరుకున్నారు. ఈ క్రమంలో పీఆర్వో కార్యాలయం వద్ద ఆర్జిత సేవలు గురించి ఆరా తీయగా, ఈ రోజు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. సోమవారం ఫోన్‌ చేసి అడిగితే సేవలు ఉన్నాయని చెప్పి, ఇప్పుడు లేవని ఎలా అంటారని ప్రశ్నిస్తూ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు. ఆలయ వర్గాలకు, పీఆర్వో కార్యాలయానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆర్జిత సేవల రద్దుపై ఆలయ అధికారులు పీఆర్వో కార్యాలయానికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఆర్జిత సేవలు ఉండవన్న విషయాన్ని మీడియాకు కూడా తెలియజేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement