‘నీట్‌’గా.. ప్రశాంతంగా.. | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’గా.. ప్రశాంతంగా..

May 5 2025 8:02 AM | Updated on May 5 2025 8:26 AM

‘నీట్

‘నీట్‌’గా.. ప్రశాంతంగా..

సాక్షి, విశాఖపట్నం/మురళీనగర్‌: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గాను నీట్‌ యూజీ–2025 పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 16 కేంద్రాల్లో 7 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ పరీక్ష కేంద్రానికి 480 మందిని కేటాయించగా 474 మంది పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నారాయణరావు చెప్పారు. గైస్‌లోని పరీక్ష కేంద్రానికి 480 మందిని కేటాయించగా 471 మంది పరీక్షకు హాజరైనట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌, కాలేజీ ప్రిన్సిపాల్‌ కె.వెంకటరమణ తెలిపారు. రెండు సెషన్స్‌లో జరిగిన ఈ పరీక్షను ఎన్‌టీఏ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఈసారి సమగ్ర విధానాన్ని అనుసరించింది. కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కేంద్రీకృత కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించారు. అయితే చెవిదిద్దులు, కాలి మెట్టెలు, చైన్లు వంటివి తొలగించిన తర్వా తే పరీక్ష కేంద్రంలోకి అడుగు పెట్టేలా కఠినంగా వ్యవహరించడంతో అమ్మాయిలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష పత్రం కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్‌ చాలా కష్టతరంగా.. కెమిస్ట్రీ మధ్యస్థంగా.. బయాలజీ చాలా సులభంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు.

జిల్లాలో 16 కేంద్రాల్లో నీట్‌ పరీక్ష

‘నీట్‌’గా.. ప్రశాంతంగా.. 1
1/2

‘నీట్‌’గా.. ప్రశాంతంగా..

‘నీట్‌’గా.. ప్రశాంతంగా.. 2
2/2

‘నీట్‌’గా.. ప్రశాంతంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement