చికిత్స పొందుతూ యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Jul 15 2025 12:32 PM | Updated on Jul 15 2025 12:32 PM

చికిత్స పొందుతూ యువకుడి మృతి

చికిత్స పొందుతూ యువకుడి మృతి

దోమ: సాగులో వాడే క్రిమి సంహారక మందు తాగి ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బాలమణి దంపతులకు శ్రీకాంత్‌(27) ఏకై క కుమారుడు. అతను కొంత కాలంగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతూ ఇబ్బందులకు గురవుతుండేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈ నెల 12వ తేదీ రాత్రి ఊటుపల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు డీగ్రి వరకు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు చేదొడు వాదొడుగా ఉండేవాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement