రెండేళ్లకోసారి.. | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లకోసారి..

Jun 30 2025 7:30 AM | Updated on Jun 30 2025 7:30 AM

రెండే

రెండేళ్లకోసారి..

కొడంగల్‌: పేదల తిరుపతిగా పేరుగాంచిన పట్టణంలోని మహాలక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జులై 19వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆలయ ధర్మకర్తలు భక్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. పవిత్రోత్సవాల నిర్వహణపై చర్చించారు. ప్రతి ఒక్కరూ భగవంతుని కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ధర్మకర్తలు కోరారు. ఆలయ పవిత్రతతో పాటు పట్టణ పురోగతి కోసం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొడంగల్‌ శ్రీవారి ఆలయంలో రెండేళ్లకు ఒకసారి ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులతో పాటు ఆలయ అర్చకులు పాల్గొని ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిత్యం జరిగే కై ంకర్యాలు, ధూప దీప నివేదనలో ఏమైనా పొరపాటు జరిగితే మంత్ర లోపము, ద్రవ్యలోపము, క్రియా లోపము వలన కలుగు దోషములకు నివారణ కలుగుతుందన్నారు. లోక కల్యాణంతోపాటు విశ్వశాంతి కలుగుతుందన్నారు. జూలై 22న ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీవారి పవిత్రోత్సవాలు

జూలై 19 నుంచి టీటీడీ తరహాలో నిర్వహణ

పోస్టర్‌ ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు

రెండేళ్లకోసారి.. 1
1/1

రెండేళ్లకోసారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement