
రక్తదానానికి ముందుకు రావాలి
పహాడీషరీఫ్: తలసేమియా బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సరూర్నగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఉమర్ బామ్ అన్నారు. మజ్లిస్–ఏ–ఉలమాయే హుఫాజ్ వా దానిశ్వరనే మిల్లత్ ఆధ్వర్యంలో షాహిన్నగర్లో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెల నెల రక్తమార్పిడి అవసరమయ్యే వారికి రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా మనదేశంలో 10–12 వేల మంది తలసేమియా పిల్లలు జన్మిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు కూడా తలసేమియాను ప్రజారోగ్య సమస్యగా ప్రకటించాలన్నారు. ఎర్ర రక్తకణాలలో హీమోగ్లోబిన్ లోపం వల్ల ఒక మాదిరి నుంచి తీవ్రమైన రక్తహీనత లక్షణాలు కలిగి, రక్త సంబంధమైన అనువంశిక రుగ్మతే తలసేమియా మేజర్గా పేర్కొంటారన్నారు. దాదాపు 390 మంది దాతలు రక్తదానం చేసి తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి అందజేశారు. కార్యక్రమంలో హాఫీజ్ అబ్దుల్ హాది, డాక్టర్ ముస్తఫా అలీ సుఫియానీ, సయ్యద్ యూసుఫ్ పటేల్, అబ్దుల్ రవూఫ్, ఎం.ఎ.బారీ, అలీం బేగ్ తదితరులు పాల్గొన్నారు.