
దైవ దర్శనానికి లిఫ్ట్ అడిగి అనంతలోకాలకు
కొడంగల్: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బయలుదేరిన ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి కొడంగల్ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్కు చెందిన శివకుమార్ చారి(26) కోస్గి బయలుదేరాడు. అక్కడి తన స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పరిగి వరకు బస్సులో వచ్చిన శివకుమార్ అక్కడ నుంచి కొడంగల్కు రాత్రి వేళ బస్సులు లేకపోవడంతో ఓ కారును లిఫ్ట్ అడిగి బయలుదేరాడు. కొడంగల్ శివారుకు చేరుకోగానే కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో ముందు భాగంలో కూర్చున్న శివకుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. కారును నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా.. వెనుక సీట్లో కూర్చున్న మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.