‘టెక్స్‌టైల్‌’ భూముల విక్రయానికి యత్నం! | - | Sakshi
Sakshi News home page

‘టెక్స్‌టైల్‌’ భూముల విక్రయానికి యత్నం!

Jun 23 2025 8:43 PM | Updated on Jun 23 2025 8:43 PM

‘టెక్స్‌టైల్‌’ భూముల విక్రయానికి యత్నం!

‘టెక్స్‌టైల్‌’ భూముల విక్రయానికి యత్నం!

నందిగామ: టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసి, స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొనుగోలు చేసిన భూమిని విక్రయించేందుకు కొందరు డైరెక్టర్లు యత్నిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. కొందరు రైతులతో కలిసి ఆదివారం హైదరాబాద్‌ హైటెక్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ వద్ద ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2002, 2003 సంవత్సరంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం చేగూరు రెవెన్యూ పరిధి నర్సప్పగూడ గ్రామ శివారులో 142 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. ఆ సమయంలో 108 మంది సభ్యులు, 8 మంది డైరెక్టర్లతో ఒక సొసైటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ భూమిలో ప్రభుత్వ రాయితీతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికులకు, భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని వివరించారు. కానీ అనుకున్న ఆశయం నెరవేరకుండా కొందరు డైరెక్టర్లు ఎవరికీ తెలియకుండా ఆ భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. తామంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో భూములు కొనుగోలు చేశామని, మా భూములు మాకు కేటాయిస్తే పరిశ్రమలు స్థాపించి, పలువురికి ఉపాధి చూపుతామని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి, జాగల విక్రయానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ భూములను తమకు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పురుషోత్తం, గడ్డం దేవదాస్‌, వెంకటరమణ, శ్రీరాములు, సురేంద్ర, రవి, రమేష్‌, బలరాం తదితరులు పాల్గొన్నారు.

నిరసన వ్యక్తంచేసిన సొసైటీ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement