
లారీ ఢీకొని యువకుడి మృతి
ఆమనగల్లు: లారీ ఢీకొ న్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ సీతారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి గ్రామానికి చెందిన మహేందర్నాథ్ అలియాస్ టిల్లు(23) బైక్పై వెళ్తున్న క్రమంలో కల్వకుర్తి నుంచి మధ్యప్రదేశ్కు పత్తిలోడ్తో వెళ్తున్న లారీ కాటన్మిల్లు సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇదే సమయంలో కల్వకుర్తి నుంచి నగరానికి వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మద్యం బాటిళ్ల పట్టివేత
అనంతగిరి: హర్యానా ప్రాంతానికి చెందిన 20 డిఫెన్స్ మద్యం బాటిళ్లను హైదరాబాద్కు తీసుకెళ్తున్న క్రమంతో రంగారెడ్డి జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వికారాబాద్లో పట్టుకున్నారు. ఒక కారులో డిఫెన్స్ మద్యం వస్తుందనే పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్చంద్ర తన సిబ్బందితో కలిసి ఎన్నెపల్లి చౌరస్తాలో శనివారం తనిఖీలు చేశారు. కారులో నుంచి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం కార్ను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ తెలిపారు.