మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

Jun 24 2025 7:39 AM | Updated on Jun 24 2025 7:39 AM

మహిళల

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోషి

పరిగి: మహిళల అఽభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోషి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని మహిళా నా యకులతో సన్నాహక సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రా ష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాల నే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రతి పథకంలో వారికి పెద్ద పీట వే స్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ అధ్యక్షురాలు సురేఖ, పట్టణ అధ్యక్షురాలు రజితరెడ్డి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

స్వేరోస్‌ నెట్‌వర్క్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవం

అధ్యక్షుడిగా రాజేష్‌

పరిగి: స్వేరోస్‌ నెట్‌వర్క్‌ జిల్లా అధ్యక్షుడిగా రాజేష్‌ను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్నాపూర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌(మర్పల్లి), ఉపాధ్యక్షులుగా ముకుంద(కొడంగల్‌), నరేందర్‌, రాజు, అధికార ప్రతినిధిగా బిచ్చన్న, కోశాధికారిగా రాజేందర్‌ను ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. స్వేరోలు జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు. అంబేడ్కర్‌, జ్యోతిరావుపూలే వంటి మహానీయులు చూపిన మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు. యువతకు, విద్యార్థులకు వారి ఆశయాల సాధన దిశగా స్వేరోస్‌ ముందుకు వెళ్తుందన్నారు.

చేనేత కార్మికులసమస్యలు పరిష్కరిస్తాం

చేనేత శాఖ డీఎంఓ కళింగరెడ్డి

దౌల్తాబాద్‌: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ డీఎంఓ కళింగరెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని బాలంపేట గ్రామంలో మండలంలోని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఇటీవల కార్మికులు వారి సమస్యలను కడా ప్రత్యేక అధికారి దృష్టికి తేవడంతో తాము ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కార్మిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ.. సంఘాలను పునరుద్ధరించి కొత్త సొసైటీలను ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యుల ఆర్థిక ఎదుగుదలకు సహకరించాలని విన్నవించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ అధికారిణి ఇంద్ర, తహసీల్దారు గాయత్రి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

అదనపు డ్యూటీలు

రద్దు చేయాలి

అనంతగిరి: అంగన్‌వాడీ టీచర్లతో బీఎల్‌ఓ అదనపు డ్యూటీలు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మిహిపాల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వికరాబాద్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూని యన్‌ నాయకులు భారతి, మనోహర, విజయలక్ష్మి, నిర్మల, సంతోష, బుజ్జమ్మ, అండాలు, స్వరూపరాణి, కవిత పాల్గొన్నారు.

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి 
1
1/2

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి 
2
2/2

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement