
దరఖాస్తు చేసుకోండి
డీఈఓ రేణుకాదేవి
అనంతగిరి: జిల్లాలోని 9 మండలాల్లో ఉన్న భవిత సెంటర్లలో ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ఫిజియోథెరపీ చేసేందుకు అర్హులైన ఫిజియోథెపిస్టులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు, బషీరాబాద్, మర్పల్లి, బొంరాస్పేట, ధారూరు, చౌడాపూర్, కోట్పల్లి, బంట్వారం, కుల్కచర్ల మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన బీపీటీతో పాటు పామా మెడికల్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. పై అర్హతలు ఉన్న జిల్లాకు చెందిన స్థానిక అభ్యర్థులు తమ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.