నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

May 31 2025 6:54 AM | Updated on May 31 2025 6:54 AM

నకిలీ

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌: నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయించి రైతులను మోసం చేసే డీలర్లపై కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్‌ నమోదు చేస్తానమి వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లోని అధీకృత డీలర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. డీలర్లు విధిగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారిణి పల్లవి, ఎస్‌ఐ భద్యానాయక్‌, డీలర్లు పాల్గొన్నారు.

రైతులకు రసీదులు ఇవ్వాలి

మహేశ్వరం: ఎరువులు, విత్తనాల దుకాణాదారులు రైతులకు అధిక ధరలకు విక్రయించరాదని మహేశ్వరం వ్యవసాయ శాఖ ఏడీఏ సుధారాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎరువులు, విత్తనాల దుకాణాదారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాల డీలర్లు స్టాక్‌, బిల్‌ బుక్స్‌ సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అనుమతిలేని మందులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవపాయాధికారి నాగమణి, డివిజన్‌ టెక్నికల్‌ అధికారి యాదగిరిగౌడ్‌, డీలర్లు పాల్గొన్నారు.

వ్యవసాయశాఖ ఏడీఏ సుజాత

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ 1
1/1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement