
నాసిరకం విత్తనాలు అమ్మితే చర్యలు
పూడూరు: రైతులకు నాసిరకమైన విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని కుత్బుల్లాపూర్లో రైతులు కొనుగోలు చేసిన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించారు. గడ్డి మందును తట్టుకునే పత్తివిత్తనాల వల్ల నష్టాల గురించి రైతులకు వివరించారు. ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రశీదులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ అధికారి లక్ష్మికుమారి, మండల అధికారి తులసీరాం, చన్గోముల్ ట్రైనీ ఎస్ఐ ప్రవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్రెడ్డి