సంత.. సమస్యల చింత | - | Sakshi
Sakshi News home page

సంత.. సమస్యల చింత

May 31 2025 6:53 AM | Updated on May 31 2025 6:53 AM

సంత..

సంత.. సమస్యల చింత

పరిగి: పట్టణంలోని మార్కెట్‌ యార్డులో ప్రతీ శుక్ర, శనివారం సంత కొనసాగుతుంది. ఇక్కడకు వచ్చే రైతులు, ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎటు చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. మార్కెట్‌ యార్డుకు ధాన్యం, కూరగాయాలు ఇతర పనులపై వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. లక్షల్లో ఆదాయం ఉన్నా సౌకర్యాలు కల్పనలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పరిగి దోమ, కుల్కచర్ల, పూడూర్‌, బొంరాస్‌ట్‌ తదితర మండలాల నుంచి రైతులు, వ్యాపారస్తులు ప్రతదీ శుక్రవారం, శనివారాల్లో సంతలో ధాన్యం, కూరగాయల క్రయ, విక్రయాలకు వస్తుంటారు. ఇందుకు మార్కెట్‌ కమిటీకి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పశువుల సంతలో పశువులు కొనుగోలు చేసిన, అమ్మినా రైతులు, వ్యాపారస్తులు మార్కెట్‌కు డబ్బులు చెల్లించాలి. ఇలా వచ్చే సొమ్ములోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే అపవాదు లేకపోలేదు.

కంపు కొడుతున్న మార్కెట్‌ యార్డు

మార్కెట్‌ యార్డుతో ఎక్కడ చూసినా కంపు కొడుతోంది. మార్కెట్‌కు కూరగాయలు తెచ్చే రైతులు, వ్యాపారస్తులు కుల్లిన కూరగాయలు వదిలి వెళ్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. మార్కెట్‌ ఆదాయంపై దృష్టి సారిస్తున్న అధికారులు పారిశుద్ధ్య పనులపై అలసత్వం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమాచారం ఇచ్చినా కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ఆదాయం దండి

మార్కెట్‌ యార్డుకు ఆదాయం వస్తున్నా.. అధికారులు మౌలిక వసతలు కల్పన, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టడం లేదు. ధాన్యం విక్రయంలోనూ మార్కెట్‌ ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కొంత మంది వ్యాపారస్తులతో కుమ్మకై ్క చిట్టీలు లేకుండానే పశువుల క్రయ, విక్రయాలు చేపట్టి మార్కెట్‌ ఆదాయానికి గండి కొడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పారిశుద్ధ్య లోపంతో చిత్తడిగా మారిన మార్కెట్‌ యార్డు

ఇబ్బందులు పడుతున్న రైతులు

పట్టించుకోని పాలకులు

అధికారులు పట్టించుకోవట్లే..

రైతులు క్రయ విక్రయాలు చేస్తేనే మార్కెట్‌కు ఆదాయం సమకూరుతుంది. కానీ రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పరిగి మార్కెట్‌ యా ర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోట్లలో ఆదాయం సమకూరుతు న్నా మార్కెట్‌ యార్డు అపరిశుభ్రంగానే ఉంటుంది.

– మల్లేష్‌, రైతు, మిట్టకోడూర్‌

సంత.. సమస్యల చింత 1
1/1

సంత.. సమస్యల చింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement