ఇవేం బదిలీలు..! | - | Sakshi
Sakshi News home page

ఇవేం బదిలీలు..!

May 30 2025 7:05 AM | Updated on May 30 2025 7:05 AM

ఇవేం బదిలీలు..!

ఇవేం బదిలీలు..!

జిల్లాకు ఇటీవల ఐదుగురు తహసీల్దార్ల కేటాయింపు ● ఇందులో ఒకరు ఉద్యోగ విరమణ పొందిన వారు.. ● సస్పెన్షన్‌కు గురైన మరో అధికారి ● మిగిలిన ముగ్గురికి మండలాలు కేటాయించని వైనం ● పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు ● ఇబ్బందుల్లో ప్రజలు

బషీరాబాద్‌: తహసీల్దార్ల బదిలీల ప్రక్రియలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. పదిహేను రోజుల క్రి తం రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది తహసీల్దార్లను ప్ర భుత్వం బదిలీ చేసిది. ఇందులో భాగంగా మన జి ల్లా నుంచి ఐదుగురిని సంగారెడ్డి, నారాయణ పేట జిల్లాలకు బదిలీ చేసింది. వీరి స్థానంలో కొత్త వారిని జిల్లాకు కేటాయించారు. ఇంత వరకు బాగా నే ఉన్నా వీరిలో ఒకరు ఉద్యోగ విరమణ పొందిన అధికారి అశోక్‌ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా నల్లగొండ జిల్లాలో ఏసీబీకి చిక్కి సస్పెండ్‌ అయిన కిరణ్‌కుమార్‌ పేరు బదిలీ జాబితాలో ఉంది. మిగిలిన ముగ్గురు తహసీల్దార్లు షాహిదాబేగం, జే.బుచ్చయ్య, వెంకటస్వామిపది రోజుల క్రితం కలెక్టరేట్‌లో రిపోర్ట్‌ చేశారు. అయితే ఇప్పటి వరకు వారికి మండలాలు కేటాయించలేదు. ప్రస్తు తం బషీరాబాద్‌, నవాబుపేట, యాలాల మండలాల తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాలాల తహసీల్దార్‌ అంజయ్య గత నెల 30న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.

డీటీలకు అదనపు బాధ్యతలు

జిల్లాలో ఖాళీగా ఉన్న బషీరాబాద్‌, యాలాల, నవాబుపేట మండల తహసీల్దార్‌ పోస్టుల్లో టీడీలకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. వారే భూముల రిజిస్ట్రేషన్‌, ఇతర ముఖ్య బాధ్యతుల నిర్వహిస్తున్నారు. వీరిపై అదనపు భారం పడటంతో రెవెన్యూ సమస్యలు సకాలంలో పరిష్కారం కావడంలేదు. దీంతో ఆయా మండలాల్లో తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

బషీరాబాద్‌, యాలాల ఆర్‌ఐలకు డిప్యూటేషన్‌

బషీరాబాద్‌, యాలాల మండలాల రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్లను ఉన్నతాధికారులు మంగళవారం డిప్యూటేషన్‌ వేశారు. ఇక్కడ పనిచేసిన నాగార్జునరెడ్డిని యాలాల ఆర్‌ఐగా,అక్కడి ఆర్‌ఐగా పనిచేసిన శివ చరణ్‌ను బషీరాబాద్‌కు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement