అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేయాలి

May 30 2025 7:05 AM | Updated on May 30 2025 7:05 AM

అంకితభావంతో పనిచేయాలి

అంకితభావంతో పనిచేయాలి

విద్యాశాఖ కమిషనర్‌ నరసింహారెడ్డి

అనంతగిరి: వికారాబాద్‌లోని డైట్‌ కళాశాలలో జరుగుతున్న తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ నరసింహారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, రిసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలులో

నిర్లక్ష్యం వద్దు

అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌

దోమ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ సూచించారు. గురువారం దోమ మండలం ఐనాపూర్‌ కొనుగోలు కేంద్రాని సందర్శించి రైతులతో మాట్లాడారు. వర్షాలు పడుతుండటంతో ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో టీటీ నర్సింహులు, ఆర్‌ఐలు సుదర్శన్‌, రాంచంద్రరావు, ఐకేపీ సీసీ సుగుణమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యులు విజయ, ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement