బీజేపీలో చోటులేదు | - | Sakshi
Sakshi News home page

బీజేపీలో చోటులేదు

May 30 2025 7:05 AM | Updated on May 30 2025 7:05 AM

బీజేపీలో చోటులేదు

బీజేపీలో చోటులేదు

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కుంభకోణాలు

చేసేవారికి

అనంతగిరి: కుంభకోణాలు చేసే వారికి బీజేపీలో చోటు ఉండదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి అభినందన సభను గురువారం పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఫ్యామిలీ నుంచి ఆయ న కూతురు కవిత కాంగ్రెస్‌లోకి వెళ్తుందని, కొడుకు కేటీఆర్‌ బీజేపీలో చేరుతారని వస్తున్న వార్తలపై స్పందించారు. లిక్కర్‌ స్కాం, ఫార్ము లా ఈ రేస్‌ వంటి కేసుల్లో ఇరుక్కున్న వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారని ఎద్దేవా చే శారు. మనమంతా కష్టపడి పని చేస్తే భవిష్యత్‌లో జిల్లాలోని మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ప్రధా ని మోదీ నిజమైన దేశభక్తి కలిగిన నాయకుడన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. జిల్లాలో అందరిని కలుపుకొని ముందుకు సాగాలన్నా రు. సమాజసేవలో ఉన్న ఓ డాక్టర్‌ను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సంతోషకరమన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర, జిల్లా ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలి పారు. జిల్లాలో అందరిని కలుపుకొని పోతా మని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీ శంకర్‌స్వామి, రామ్‌ధారి అఖండ పీఠాధిపతి శ్రీ వేదయోగి మహరాజ్‌, కృష్ణ యజుర్వేద పండితుడు డాక్టర్‌ మన్యురింద్ర శర్మ, జిల్లా ఇన్‌చార్జి పగడాకుల శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, సదానందరెడ్డి, రమేష్‌కుమార్‌, పరమేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, నాయకులు వెంకటయ్య, పాండు గౌడ్‌, శ్రీధర్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, నందు పాల్గొన్నారు.

ఐటీఐని సందర్శించిన ఎంపీ

మర్పల్లి: మండల కేంద్రంలోని ఐటీఐ కళాశాలను గురువారం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సందర్శిఽంచారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉన్న కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బీజేపీ మండల అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశం, నాయకులు బలరాంగౌడ్‌, అన్నపూర్ణ, మహేశ్వరి, శ్రీమంత్‌కుమార్‌, సంగమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement