
అటవీ భూమిని ఆక్రమిస్తే చర్యలు
బొంరాస్పేట: మండలంలోని తిర్మలాపూర్లో అటవీ భూమిని ఆక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. ఈ నెల 24న సాక్షి దినపత్రికలో అటవీ భూ మి ఆక్రమణ అనే శీర్షికన ప్రచురితమై కథనంపై ఆ యన స్పందించారు. మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అటవీ భూమిని ఆక్రమించిన ఘటనపై ఈ నెల 23న ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఎన్కేపల్లికి చెందిన పూజారి నర్సింలు 1.30 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు. రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. నరికిన చెట్ల స్థలంలో కొత్తగా మొక్కులు నాటించి, వాటిని సంరక్షించే బాధ్యత నర్సింలుకు అప్పగిస్తున్నామని చెప్పారు. అక్రమార్కులు అడవిలోకి ప్రవేశించకుండా ట్రెంచింగ్ పనులు చేయించామని పేర్కొన్నారు.
అడవుల సంరక్షణ మన బాధ్యత
యాలాల: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ మన బాధ్యతఅని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని సంగాయిపల్లి తండాలో అడవుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ భూముల్లో చెట్లు నరకడం నేరమన్నారు. అటవీ భూమిని ఉపగ్రహ ఛాయా చిత్రాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ కిరణ్కుమార్, ఎస్ఐ గిరి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్, సెక్షన్ ఆఫీసర్లు కనకరాజు, శంకర్, బీట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్
భూమి కజ్జా చేసిన వ్యక్తిపై కేసు

అటవీ భూమిని ఆక్రమిస్తే చర్యలు