జాబ్‌మేళాను సక్సెస్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాను సక్సెస్‌ చేయాలి

May 28 2025 5:55 PM | Updated on May 28 2025 5:55 PM

జాబ్‌

జాబ్‌మేళాను సక్సెస్‌ చేయాలి

అనంతగిరి: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న తాండూరులో నిర్వహించే జాబ్‌మేళాను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాబ్‌మేళాపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి కల్పన, మార్కెటింగ్‌ మిషన్‌(ఈజీఎంఎం) ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 52 పరిశ్రమల్లో 11 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్‌ హాల్‌లో జాబ్‌మేళా ఉంటుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సుధీర్‌, ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కృష్ణన్‌, జేడీఎం సతీష్‌, తాండూరు సీడీపీఓ శ్రీలత, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింహారెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

జాబ్‌మేళాను సక్సెస్‌ చేయాలి1
1/1

జాబ్‌మేళాను సక్సెస్‌ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement