
బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీ ఏర్పాటు
అనంతగిరి: బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష తెలిపారు. పట్టణ ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, అశోక్ ముదిరాజ్, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్చారి, ప్రధాన కార్యదర్శులుగా ఉప్పు అమర్నాథ్, వెంకట్, కార్యదర్శులుగా ప్రశాంత్, గిరిజ, వినోద్, సువానీ, కోశాధికారిగా రాంమోహన్తో పాటు పలువురిని కార్యవర్గ సభ్యులుగా నిమించినట్లు ఆమె తెలిపారు.
ధాన్యం మిల్లులకు
తరలించండి
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
ధారూరు: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని గట్టెపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం బస్తాలు తడిసే అవకాశం ఉందని, వెంటనే మిల్లులకు తరలించాని ఆదేశించారు.
ఈసెట్లో సత్తా చాటిన విద్యార్థులు
అనంతగిరి: పాలిటెక్నిక్ పూర్తి చేసి నేరుగా ఇంజనీరింగ్లో ప్రవేశం పొందడానికి ప్రభుత్వం నిర్వహించిన ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. వికారాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే రవీందర్ తెలిపారు. ఈసీఈ బ్రాంచ్ విద్యార్థులు గొల్ల శ్రీశైలం 3వ ర్యాంక్, గొల్ల స్వామి 62వ ర్యాంక్, అక్షయ 95వ ర్యాంక్, డి.అక్షయ్ రెడ్డి 103 ర్యాంక్, టి.సందీప్ 131 ర్యాంక్, ఎం.పృథ్విరాజ్ 158వ ర్యాంక్ సాధించారు. వీరిని ప్రిన్సిపాల్తో పాటు ఈసీఈ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ, అధ్యాపకుడు జయచంద్రారెడ్డి అభినందించారు.
దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యం
పూడూరు: దేశ రక్షణతో పాటు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్ అన్నారు. ప్రధాని మోదీ తలపెట్టిన మన్కీబాత్ కార్యక్రమాన్ని ఆదివారం పూడూరులో స్థానిక నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశ ప్రజలకు రక్షణగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, నాయకులు శ్రీశైలం, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా గ్రామపాలన అధికారి ఎంపిక పరీక్ష
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన గ్రామపాలన అధికారి ఎంపిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షకు 150 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 143 మంది వచ్చారని తెలిపారు. అంతకుముందు అధికారుల సమక్షంలో పరీక్ష పేపర్లకు సబంధించిన సీల్ ఓపెన్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, డీటీడీఓ కమలాకర్రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్ నేహామత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీ ఏర్పాటు

బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీ ఏర్పాటు

బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీ ఏర్పాటు