కాంగ్రెస్‌లో పదవుల పందేరం! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో పదవుల పందేరం!

May 26 2025 7:35 AM | Updated on May 26 2025 7:35 AM

కాంగ్

కాంగ్రెస్‌లో పదవుల పందేరం!

బషీరాబాద్‌: అధికార పార్టీలో పదవుల పందేరం మొదలైంది. పార్టీ సంస్థాగత నిర్మాణానికి టీపీసీసీ ఆదేశాలు జారీ చేయడంతో మండల కమిటీల ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. నేటి నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2017 కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నవారే మండల అధ్యక్ష పదవులకు అర్హులని అధిష్టానం స్పష్టం చేసింది. దీంతో ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సీనియర్‌ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పార్లమెంట్‌ ఎన్నికల సయమంలో కూడా బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు హస్తం గూటికి చేరారు. వీరు సైతం మండల పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ నిర్ణయంతో వారికి పదవులు దక్కే అవకాశం లేదు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్‌ అధ్యక్ష, కార్యదర్శుల పదవుల్లో కొత్తవారికి చోటు ఇవ్వాలని టీపీసీసీ సూచించింది. ఇదిలా ఉండగా పార్టీ, నామినేటెడ్‌ పదవుల్లో చోటు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతోనే తాము కాంగ్రెస్‌లో చేరినట్లు తాండూరుకు చెందిన ఓ నాయకుడు తెలిపారు. ఇప్పుడు కొత్త, పాత అని షరతులు పెట్టడమేంటని ప్రశ్నించారు.

పార్టీ పదవుల కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని అధిష్టానం ఇప్పటికే సూచించింది. మండల అధ్యక్ష పదవులు ఎవ్వరికి ఇవ్వాలనే విషయాన్ని మండలాల వారీగా ముఖ్యనాయకులు సమావేశమై ముగ్గురు పేర్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు ద్వితీయశ్రేణి నాయకులకు సూచించారు. దీంతో ఆశావహులు పైరవీలు మొదలు పెట్టారు.

కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారికే మండల అధ్యక్ష పదవులు

కొత్తవారికి అనుబంధ కమిటీల్లో చోటు

నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ న్యాయం జరగాలి

పార్టీ పదవుల్లో పాత, కొత్త నాయకులను కలుపుకొని అందరికీ న్యా యం జరిగేలా అధి ష్టానం చర్యలు చేపట్టాలి. పార్టీ కోసం పనిచేస్తున్న వారందరినీ సమన్వయం చేస్తూ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తే మంచిది.

– మాధవరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, బషీరాబాద్‌

కాంగ్రెస్‌లో పదవుల పందేరం! 1
1/1

కాంగ్రెస్‌లో పదవుల పందేరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement