
ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు రూరల్: మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీదేవి సూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఫస్టియర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో 40 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మంగళవారం నుంచి ఆన్లైన్లో ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేస్తామన్నారు. బాలికలకు హాస్టల్ వసతి ఉందన్నారు. కళాశాలలో అ నుభవజ్ఞలైన అధ్యాపకులు ఉన్నారని, ప్రతి ఏ టా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
కేజీబీవీలో ప్రవేశాలకు..
దోమ: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో, ఇంటర్ మొదటి సంవత్సరం, ఎంపీఎచ్ఈడబ్ల్యూ గ్రూపులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ వెంకట్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 40 సీట్లు, సీఈసీలో 40 సీట్లు, ఎంపీఎచ్ఈడబ్ల్యూలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్కార్డు, రెండు పాస్ సైజ్ ఫొటోలు, పదో తరగతి మెమో జిరాక్స్, కులం సర్టిఫికెట్ జిరాక్స్ను దరఖాస్తు ఫారానికి జత చేసి పాఠశాలలో సమర్పించాలని తెలిపారు.
నేడు రాజీవ్ యువ వికాస్ లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు
నవాబుపేట: మండలంలోని ఎల్లకొండ కెనరా బ్యాంకులో రాజీవ్ యువ వికాస్ పథకం కింద రుణాల కోసంఽ దరఖాస్తు చేసుకున్న వారికి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లకొండ బ్యాంక్ పరిధిలోకి వచ్చే గ్రామాలైన ఎల్లకొండ గొల్లగూడ, ముబారక్పూర్, ఉబ్బడిపత్తేపూర్, మైతాప్ఖాన్గూడ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు రేషన్కార్డు, ఆధార్, కుల, ఆదాయ, బ్యాంక్ పాస్బుక్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆమె సూచించారు.
మూఢ విశ్వాసానికి
బాలుడి బలి
● నాగుపాము కాటేయడంతో మంత్రగాడిని ఆశ్రయించిన వైనం
● పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి
దోమ: తల్లిదండ్రుల మూఢ విశ్వాసం ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పాఠశాలలకు సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటన దోమ మండలం బాస్పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి రాములు, సువర్ణకు ముగ్గురు కుతుళ్లు, ఓ కుమాడు. చిన్నవాడైన చాకలి శివకుమార్(11) పరిగి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేసుకుని, సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. ఉదయం పది గంటలకు తాతతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో నాగుపాము అతన్ని కాటేసింది. గమనించి బాలుడు కుటుంబ స భ్యులకుచెప్పడంతో..మంత్రతంత్రాలతో బాగవుతుందని దొంగఎన్కేపల్లికి తీసుకెళ్లారు. పరి స్థితి విషమించడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ స భ్యులు శకసంద్రంలో మునిగిపోయారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బాలుడు బతికే వాడని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.
పశువులకు టీకాలు
షాబాద్: పశువులకు వచ్చే సీజన్ల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రేగడిదోస్వాడ, షాబాద్ పశువైద్యాధికారులు చంద్రశేఖర్రెడ్డి, స్రవంతి రైతులకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం