అంకితభావంతో పనిచేయండి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేయండి

May 6 2025 10:10 AM | Updated on May 6 2025 10:10 AM

అంకితభావంతో పనిచేయండి

అంకితభావంతో పనిచేయండి

ధారూరు: అధికారులు అంకితభావంతో పనిచేసి భూ భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల ని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ఆదేశించారు. సోమవారం మండలంలోని బాచారం, అవుసుపల్లి గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వస్తున్న సమస్యలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రతి అర్జినీ స్వీకరించాలని ఆదేశించారు. అవుసుపల్లికి చెందిన 11మంది, బాచారం గ్రామానికి చెందిన 16 మంది భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందజేశారు. మంగళవారం కా చారం, అంపల్లి గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగాల పనితీరు మెరుగు పర్చేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను మంజూరు చేసిందని, వీటి కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేస్తామని తెలిపారు. మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్‌ఐఎంఎస్‌ఈ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అలాగే సెల్‌ నంబర్‌ 8688921546లో సంప్రదించాలన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement