
రైతులు ఆందోళన చెందొద్దు
ఆమనగల్లు: అన్నదాతలు ఆందోళన చెందవద్దు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, న్యాయం చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కురిసిన వానకు ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో కుప్పలుగా పోసిన వడ్లు తడిసిపోగా.. ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు.
విపక్షాల రాజకీయం
ఏనాడు రైతు సంక్షేమం పట్టని విపక్షాలు.. అకాలవర్షానికి ధాన్యం తడిస్తే.. దానిని రాజకీయం చేస్తూ, పబ్బం గడుపుకొనే యత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ.. రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షలు మాఫీ చేసిందని పేర్కొన్నారు. సన్నాలకు అదనంగా క్వింటాకు రూ.500 అందిస్తున్నామని చెప్పారు. వ్యవ సాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించి ఆదుకు న్నది కాంగ్రెస్ పార్టేనన్నారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భా స్కర్రెడ్డి, తలకొండపల్లి సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు శ్రీశైలం, పాండు రంగ య్య, రవీందర్, అజీం, రమేశ్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మానయ్య, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ఫరీద్, నాయకులు ఖలీల్, కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఖాదర్, బాబా, శ్రీపాల్, రాము తదితరులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి