
జెడ్పీ..ఖాతా ఖాళీ!
● ఉన్న రూ.2 కోట్ల నిధులుభవన నిర్మాణానికే కేటాయింపు ● వేధిస్తున్న అధికారుల కొరత ● జూనియర్ అసిస్టెంట్లతోనేకొనసాగుతున్న కార్యాలయం ● జిల్లా పరిషత్ సేవలు అస్తవ్యస్తం
వికారాబాద్: జిల్లా పరిషత్ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కీలకంగా వ్యవహరించాల్సిన జెడ్పీ నామమాత్రమైంది. ప్రస్తుత గడ్డు పరిస్థితిలో ఖాతాలో ఉన్న నిధును మండల పరిషత్లు, జీపీలకు కేటాయించాల్సిందిపోయి ఇప్పటికిప్పుడు అవసరంలేని జెడ్పీ భవనం కోసం వినియోగించారు. ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల నిధులను భవనానికే కేటాయించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలక మండలి ఉన్న సమ యంలో అవిశ్వాసం నేపథ్యంలో నిధులు ఖర్చు చేయలేదు.ప్రత్యేకాధికారుల పాలన వచ్చాక ఓ నేత సూచన మేరకు నిధులన్నీ బిల్డింగ్ నిర్మాణానికే కేటాయించినట్లు సమాచారం.ప్రస్తుతం జిల్లా పరిషత్లో ఉన్న నిధులకు సంబంధించి గత పాలక మండలి సమయంలోనే పనులు చేపట్టేందుకు ప్రొసిడింగులు ఇవ్వగా పాలకమండలి వీటికి తీర్మానం చే యకపోవడంతో అవన్నీ రద్దయ్యాయి.కానీ వీటిలో చాలా వరకు పనులు పూర్తి కావడం గమనార్హం.
పోస్టులన్నీ ఖాళీ
● ఏడాది కాలంగా జిల్లా, మండల పరిషత్లలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
● జెడ్పీ ఆఫీస్ మొత్తాన్ని జూనియర్ అసిస్టెంట్లతోనే నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది.
● ప్రస్తుత సీఈఓ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా మరో నాలుగు అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటంతో మండల పరిషత్ల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది.
● జిల్లాలో 20 మండలాలు ఉండగా కొత్త మండలాలకు పోస్టులు మంజూరు కాలేదు.
● జిల్లా, మండల పరిషత్లలో 19 సూపరింటెండెంట్ పోస్టులకు గాను తొమ్మిది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
● ఐదు మండల పరిషత్లలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
● జెడ్పీలో రెండు సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
● నాలుగు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా వీరిలో ఇద్దరు ఇతర మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు మెడికల్ లీవ్లో ఉండగా మరొకరు చేవెళ్ల ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్నారు.
● నాలుగు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఇద్దరు వేరే మండలాల్లో విధులు నిర్వహిస్తుండగా ఒకరు మెడికల్ లీవ్లో ఉన్నారు. మరొకరు చేవెళ్ల ఎమ్మెల్యేకు పీఏగా పని చేస్తున్నారు.
సీఈఓకు ఏడు బాధ్యతలు
కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో జెడ్పీ కార్యాలయానికి సొంత భవనాన్ని కేటాయించలేదు.
మండల పరిషత్ కోసం నిర్మించిన భవనంలోనే జెడ్పీ ఆఫీసును ఏర్పాటు చేశారు.
రెండున్నరేళ్ల క్రితం జెడ్పీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మొదటి అంత స్తు పూర్తవడంతో మూడు నెలల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకూ ఆఫీసును ఇక్కడికి తరలించలేదు.
జెడ్పీ సీఈఓ కుర్చీ ఏడాది కాలంగా ఖాళీగా ఉంటూ వస్తోంది. ప్రస్తుత జెడ్పీ సీఈఓకు అదనపు కలెక్టర్గా, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారిగా, వికారాబాద్ మండల స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు ఉన్నాయి. ఇలా ఒకే అధికారి ఏడు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది.
నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మండల పరిషత్లు, జీపీలు