కేశంపేట: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో వందశాతం ఇంటి పన్నులనులత మూడు రోజుల్లోగా వసూలు చేయాలని రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ఆదేశించారు. మండల పరిధిలోని సంగెం గ్రామ పంచాయతీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామంలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. సురేష్ మోహన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, మురుగు కాల్వలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎల్ఆర్ఎస్పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.