
ఎమ్మార్పీఎస్ దీక్షకు బీఆర్ఎస్ సంఘీభావం
శంషాబాద్ రూరల్: మాదిగల రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం శంషాబాద్ బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్రావు దీక్షాస్థలికి చేరుకుని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల రిజర్వేషన్ల పట్ల దోబూ చూలాడుతోందని విమర్శించారు. దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించకుండా కొన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, జయమ్మ, కె.శ్రీనివాస్, రాజేందర్, అశోక్, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.