● డీపీఓ జయసుధ
పారిశుద్ధ్య
మెరుగుకు
ధారూరు: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని డీపీఓ జయసుధ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బుధవారం మండలంలోని చింతకుంట, కేరెళ్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఆయా గ్రామాల్లోని డంపింగ్యార్డులు, వర్మీ కంపోస్టు యూనిట్లు, మొక్కల పెంపకాన్ని పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పశువుల తాగునీటికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. తొట్లలో నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రెండు పంచాయతీల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ షఫీఉల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.