డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన అవసరం

Mar 13 2025 2:36 PM | Updated on Mar 13 2025 2:35 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులు

రెహమాన్‌, సావిత్రి

దోమ: డిజిటల్‌ లావాదేవీలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులు రెహమాన్‌, సావిత్రి అన్నారు. బుధవారం దోమ మండలం దొంగఎన్కేపల్లి గ్రామంలో డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ..మార్చి 10 నుంచి 16వ తేదీ వరకు డిజిటల్‌ లావాదేవీలపై ప్రతి బ్యాంక్‌ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.బ్యాంకులు సూచించిన యాప్‌ ల ద్వారానే లావాదేవీలుజరుపుకోవాలన్నారు. నగదు రహిత లావాదేవీలు చేసే క్రమంలో సైబర్‌ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ సీనియర్‌ బిజినెస్‌ మేనేజర్‌ విజయేందర్‌, పరిగి టీజీబీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నరేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

హిస్టరీ లెక్చరర్‌గా బ్రాహ్మిణి

బొంరాస్‌పేట: మండల పరిధిలోని చౌదర్‌పల్లిలో ఎస్జీటీగా పనిచేస్తున్న పి.బ్రాహ్మిణి బుధవారం రవీంద్రభారతిలో జూనియర్‌ లెక్చరర్‌గా నియామక పత్రం అందుకున్నారు. చరి త్ర (హిస్టరీ) సబ్జెక్టులో మహిళా అభ్యర్థులలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించారు. నల్గొండ జిల్లాకు చెందిన బ్రాహ్మిణి 2017లో టీచర్‌ ఉద్యోగం పొందారు. 317జీవోలో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో నియామకమై తాజా బదిలీల్లో మండలంలోని చౌదర్‌పల్లి ఎంపీపీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని మహబూబియా కళాశాలలో హిస్టరీ జూనియర్‌ లెక్చరర్‌గా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకున్నారు. బ్రాహ్మిణికి పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు అనిల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఎల్‌.శశిధర్‌, హెచ్‌ఎం పరమేశ్వరి, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, శ్రీప్రియ, నవీన్‌కుమార్‌ అభినందనలు తెలిపారు.

గ్రూప్‌ –1 ఫలితాల్లో

సత్తా చాటిన సస్యరెడ్డి

బంట్వారం: ఇటీవల విడుదలైన టీజీపీఎస్సీ గ్రూప్‌ –1 పరీక్ష ఫలి తాల్లో కోట్‌పల్లి మండలం మోత్కుపల్లికి చెందిన కేరెల్లి సస్యరెడ్డి సత్తా చాటారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి 462.5 మార్కులు సాధించారు. సస్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదువుతోంది. తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి, శ్యామలత ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌–1 ఉద్యోగానికి ఎంపికై ంది. తండ్రి వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. కూతురు గ్రూప్‌–1 పరీక్షలో సత్తా చాటినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యారంగానికి

పెద్దపీట వేయాలి

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు

అనంతగిరి: త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు డిమాండ్‌ చేశారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాల ర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మురళీ, దయాకర్‌, సాయికిశోర్‌, రామ్‌, కార్తీక్‌, మహేష్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్‌ లావాదేవీలపై  అవగాహన అవసరం 
1
1/3

డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన అవసరం

డిజిటల్‌ లావాదేవీలపై  అవగాహన అవసరం 
2
2/3

డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన అవసరం

డిజిటల్‌ లావాదేవీలపై  అవగాహన అవసరం 
3
3/3

డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement