‘కల్యాణలక్ష్మి’లో అక్రమాలు
బషీరాబాద్: కల్యాణలక్ష్మి పథకం అమలులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ ఆరోపించారు. డబ్బులిస్తే అధికారులు అనర్హులకు పథకం అందేలా చూస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్ల క్రితం మండలంలోని గొట్టిగకలాన్ గ్రామంలో బాలికకు పెళ్లి జరిగిందని, ఆమెకు 18 ఏళ్లు నిండాక వివాహం జరిగిందని అధికారులే తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ చేయాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ వెంకటేశ్కు వినతిపత్రం అందజేశారు.