మత్తు పదార్థాలు అమ్మితే జైలుకే | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలు అమ్మితే జైలుకే

Mar 13 2025 2:36 PM | Updated on Mar 13 2025 2:35 PM

మోమిన్‌పేట సీఐ వెంకట్‌

మోమిన్‌పేట: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకొంటామని సీఐ వెంకట్‌ హెచ్చరించారు. బుధవారం మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మత్తు పదార్థాలు, గంజాయి తదితర వాటిని అమ్మిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేటుగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకొంటున్నారని తెలిపారు. ద్విచక్రవాహనదారులు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదన్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచులు రానుండటంతో బెట్టింగ్‌లకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐ అరవింద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement