నిర్మాణ రంగంలో భారతి సిమెంట్‌ ప్రత్యేకం | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగంలో భారతి సిమెంట్‌ ప్రత్యేకం

Mar 13 2025 2:36 PM | Updated on Mar 13 2025 2:35 PM

పూడూరు: నిర్మాణ రంగంలో భారతి సిమెంట్‌ కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆ సంస్థ టెక్నికల్‌ ఇంజనీర్‌ సామ్రాట్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మన్నెగూడలో మదీన ట్రేడర్స్‌ లో తాపీమేసీ్త్రల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర సిమెంట్‌లతో పోలిస్తే భారతి సిమెంట్‌ నాణ్యమైందన్నారు. నిర్మాణ పక్రియలో ఆల్ట్రాఫాస్ట్‌ తొందరగా సెట్టింగ్‌ అవుతుందని తెలిపారు. ఆల్ట్రాఫాస్ట్‌తో స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రోడ్లకు సంబంధించిన పనులకు వాడితే దృఢంగా ఉంటాయన్నారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్‌ అక్బర్‌, తాపీమేసీ్త్రలు తదితరులు పాల్గొన్నారు.

పది ఫోన్ల రికవరీ

అనంతగిరి: సీఈఐఆర్‌ యాప్‌ సాయంతో పది మంది బాధితులకు సెల్‌ఫోన్లు అందచేసినట్లు వికారాబాద్‌ సీఐ భీంకుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన వికరాబాద్‌ ఠాణా పరిధిలో సీఎస్‌ఐఆర్‌ యాప్‌తో 10 మంది సెల్‌ రికవరీ చేసి అందించామన్నారు. మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్లు వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

కుక్క దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలు

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బుధవారం గిరిగేట్‌పల్లిలో చౌరస్తా వద్ద ఉదయం 8.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన పలువురు చిన్నారులు పట్టణ కేంద్రంలోని తమతమ స్కూళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈక్రమంలో ఓ కుక్క ఒక్కసారిగా వచ్చి అక్కడ నిల్చున్న నలుగురు చిన్నారులపై దాడి చేసి, కరిచింది. వీరిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఇదిలా ఉండగా గ్రామంలో కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో

మేసీ్త్ర మృతి

యాలాల: రోడ్డు ప్రమాదంలో ఓ మేస్త్రీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోనలి రాఘవపూర్‌ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. బొంరాస్‌పేట మండలం మెట్లకుంటకు చెందిన సుధాకర్‌(30) మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. బుధవారం తాండూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రాఘవాపూర్‌ దాటాక రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా..? అడవి పంది అడ్డొచ్చిందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు.

దివ్యాంగ సమస్యలపై

చర్చించండి

అనంతగిరి: అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాల్లో దివ్యాంగుల సమస్యలపై చర్చించేందుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ చొరవ చూపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే సభలో చర్చించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.6వేల పెన్షన్‌ ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. వెంటనే అధిక పింఛను ఇచ్చి న్యాయం చేయాలన్నారు. సమావేశంలో చంద్రయ్య, చుక్క య్య, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ రంగంలో  భారతి సిమెంట్‌ ప్రత్యేకం 1
1/4

నిర్మాణ రంగంలో భారతి సిమెంట్‌ ప్రత్యేకం

నిర్మాణ రంగంలో  భారతి సిమెంట్‌ ప్రత్యేకం 2
2/4

నిర్మాణ రంగంలో భారతి సిమెంట్‌ ప్రత్యేకం

నిర్మాణ రంగంలో  భారతి సిమెంట్‌ ప్రత్యేకం 3
3/4

నిర్మాణ రంగంలో భారతి సిమెంట్‌ ప్రత్యేకం

నిర్మాణ రంగంలో  భారతి సిమెంట్‌ ప్రత్యేకం 4
4/4

నిర్మాణ రంగంలో భారతి సిమెంట్‌ ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement