కొనలేం..తినలేం! | - | Sakshi
Sakshi News home page

కొనలేం..తినలేం!

Oct 30 2025 7:53 AM | Updated on Oct 30 2025 7:53 AM

కొనలే

కొనలేం..తినలేం!

● కొండెక్కిన కూరగాయలు ● ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు ● తుపాను ఎఫెక్ట్‌తో చుక్కలు చూపుతున్న ధరలు ● బెంబేలెత్తుతున్న సామాన్యులు ● ఓ యూనివర్సిటీలో చిరుద్యోగిగా పనిచేస్తున్న సుబ్బలక్ష్మి నెల జీతం రూ.16వేలు. తిరుపతి కొర్లగుంటలో నెలకు రూ.5వేలు చెల్లించి అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పాలు, పెరుగు, పప్పుదినుసులు తదితర నిత్యావసర సరుకులకు నెలకు సుమారు రూ. 5వేల వరకు ఖర్చవుతుంది. దీనికి తోడు కూరగాయల ధరలు అమాంత పెరగడంతో వారానికి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. ఇక తుపాను ప్రభావంతో ధరలు మరింతగా పెరగడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ● పప్పుదినుసులు, కూరగాయలు సామాన్యుడికి దొరకడంలేదు. జీవనం భారమైంది. కనీసం రెండు పూటలా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడం లేదంటూ తిరుపతి కొర్లగుంటకు చెందిన శ్యామ్‌ ప్రసాద్‌ అనే దినసరి కూలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు, భార్య దివ్యాంగురాలు. ఒక్కడు కష్టపడితే నలుగురు తినాల్సిన పరిస్థితి. రోజూ కూలీ దొరికితే రూ. 600లు వస్తుంది. తుపాను కారణంగా మూడు రోజుల నుంచి పని లేదు. దీంతో పూట గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో కూరగాయల ధరలు భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలా పొట్టపోసుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో

కూరగాయల ధరలు

కూరగాయలు కిలో రూ.లో టమాట 75

ఉల్లి 70

వెల్లుల్లి 220 వంకాయ 110

బెండ 85

పచ్చిమిర్చి 90

కాకర 90

బీరకాయ 110

దొండ 100

గోరు చిక్కుడు 105 బీన్స్‌ 125

క్యారెట్‌ 110

బీట్‌రూట్‌ 105

బంగాళదుంప 95

ఆకుకూరలు కట్ట 55

రూ.వంద దాటిన కేజీ

ధరల పెరుగుదలతో గృహిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏ కూర చేయాలన్నా టమాట, ఉల్లి తప్పనిసరి. ప్రస్తుతం కేజీ టమాట ధర రూ.వందకు చేరువలో ఉంది. రిటైల్‌ షాపులలో వంకాయ, బెండకాయ, బీన్స్‌, క్యారెట్‌ ధరలు రూ. 100 నుంచి 110వరకు పలుకుతున్నాయి. రైతు బజార్‌లోనే రూ.85 ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉల్లి ధరలు నాణ్యత, రకం మేరకు కేజీ రూ. 65 నుంచి 90వరకు పలుకుతున్నాయి. బెండ, చిక్కుడు, కాకర, బీట్‌రూట్‌, క్యారెట్‌, వంగ, బీన్స్‌, బంగాళదుంప వంటి కూరగాయలు ప్రస్తుతం తిరుపతి మార్కెట్‌లో రూ. 50 నుంచి రూ.120వరకు విక్రయిస్తున్నారు.

తిరుపతి సిటీ : జిల్లాపై మోంథా తుపాను ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. మూడు రోజులుగా జన జీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అలాగే నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు పరిస్థితి దయనీయంగా మారింది. రెక్కడాతేగానీ డొక్కాడని దినసరి కూలీల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏం తినాలన్నా మార్కెట్‌లో ధరలు దడ పుట్టిస్తున్నాయి. కేజీ కొనుగోలు చేసేవాళ్లు ప్రస్తుతం 250 గ్రాములతోనే సరిపెట్టుకుంటున్నారు.

దెబ్బతిన్న పంటలు

కూరగాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణం మోంథా తుఫాన్‌ ప్రభావమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూరగాయల సాగు అధికంగా చేపట్టిన జిల్లాలలో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా జిల్లాలో కూరగాయల సాగు సుమారు 2వేల ఎకరాల్లో చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కేవలం వెయ్యి ఎకరాలకే మాత్రమే చేపట్టారు. సాగు విస్తీర్ణానికి తగ్గట్టు పంట దిగుబడి రాకపోవడం. ఇతర రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో టమాట, ఉల్లి దిగుమతులు లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెటింగ్‌ శాఖ అంచనా ప్రకారం తిరుపతిలో రోజుకు 3వేల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని, ప్రస్తుతం కేవలం 1,500 టన్నులు మాత్రమే రోజుకు దిగుమతి అవుతున్నాయని సమాచారం. మరో రెండు నెలల పాటు కొండెక్కిన కూరగాయల ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని మార్కెట్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కొరవడిన ప్రోత్సాహం

కూరగాయల పంటల సాగుతో పాటు పూల తోటలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. విత్తన సరఫరా, వ్యవసాయాధికారులనుంచి సమాచార లోపం కారణంగా చెప్పవచ్చు. ధరల నియంత్రణపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.

కొనలేం..తినలేం!1
1/1

కొనలేం..తినలేం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement