శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ

Oct 30 2025 7:53 AM | Updated on Oct 30 2025 7:53 AM

శ్రీవ

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుంచి 9గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ నిర్వహించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

నేడు పుష్పయాగం

శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈనేపథ్యంలో తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ1
1/1

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement