త్వరలోనే జూనియర్స్‌ సీపీఎల్‌–1 | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే జూనియర్స్‌ సీపీఎల్‌–1

Jun 30 2025 7:52 AM | Updated on Jun 30 2025 7:52 AM

త్వరలోనే జూనియర్స్‌ సీపీఎల్‌–1

త్వరలోనే జూనియర్స్‌ సీపీఎల్‌–1

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతి వేదికగా త్వరలోనే జూనియర్స్‌ చిత్తూరు ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌–1) పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ (సీడీసీఏ) అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ హోటల్‌లో సీపీఎల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో సీపీఎల్‌–1 విజయవంతంగా నిర్వహించామన్నారు. దీంతో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌(ఏసీఏ)కు తొలిసారిగా 60మంది క్రికెటర్లు రిజిస్టర్‌ చేసుకోవడం గర్వకారణమని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఏపీఎల్‌, ఐపీఎల్‌లో ఎక్కువ మంది ఆడాలనే లక్ష్యంతోనే సీపీఎల్‌ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇదే స్పూర్తితో చిన్న వయసు నుంచే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 12 ఏళ్ల నుంచి 16ఏళ్లలోపు క్రికెటర్లతో జూనియర్స్‌ సీపీఎల్‌–1 పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లు సైతం టీ–20 ఫార్మాట్‌లోనే ఉంటాయని, ప్రత్యక్ష ప్రసారం సైతం చేయనున్నట్లు తెలిపారు. 8 టీమ్‌లను ప్రాంచైజీ ద్వారా దక్కించుకోవడానికి ఆసక్తి గలవారు ముందుకు రావాలని కోరారు. పూర్తి వివరాలకు 88861 85559, 90002 14966నంబర్లలో సీడీసీఏ జాయింట్‌ సెక్రటరీ సతీష్‌ యాదవ్‌, సునీల్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వూకా విజయ్‌కుమార్‌, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, సీడీసీఏ కార్యదర్శి రవి, కోశాధికారి గిరిప్రకాష్‌, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement