
‘కౌటిల్య’ విద్యార్థులకు ఐఐఎం అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎమ్మార్పల్లె సర్కిల్లోని కౌటిల్య విద్యాసంస్థ విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) బిజినెస్ స్కూళ్లల్లో ఎంబీఏ అడ్మిషన్లు పొందారు. గత ఏడాది నవంబరులో జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యాట్ పరీక్ష తుది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి ఐఐఎంలలో అడ్మిషన్లు సాధించినట్లు కౌటిల్య విద్యాసంస్థ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. జి.వెంకట నితీష్ ఐఐఎం రాంచి, కె.హారికారాజు ఐఐఎం సిరమౌర్, భవ్యశ్రీ నిశిత, కె.కార్తీక్ ఐఐఎం నాగపూర్, ఐఐఎం సిర్మార్, పూణెలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్కు జి.అభినయ్ సుప్రీత పీఎన్.సుదర్శన్ అడ్మిషన్లు సాధించినట్లు వివరించారు. క్యాట్ పరీక్ష, ఐఐఎంలలో అడ్మిషన్లకు సంబంధించి ఉచిత గైడెన్స్కు 96981 23456 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఐఐఎంలలో సీట్లు సాధించిన విద్యార్థులను బోధనా సిబ్బంది ఎన్.హరి, ఎన్ఎస్.రెడ్డి అభినందించారు.