
ఇంటర్వ్యూకు రాకుంటే తొలగిస్తాం
తిరుపతి సిటీ : ఎస్వీయూ అకడమిక్ కన్సల్టెంట్లకు ఫర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో మంగళవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆదివారం ఈ సందర్బంగా రిజిస్ట్రార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కన్సల్టెంట్లు ఇంటర్వ్యూకు రాకుంటే వెంటనే విధుల నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు తాత్కాలిక అధ్యాపకులకు సమాచారం అందించారు. మంగళవారం 43మందికి, 2వతేదీ 51మందికి, 3న 47మందికి, 4న 51మందికి, 5వ తేదీన 51మంది తాత్కాలిక అధ్యాపకులకు వీసీ ఛాంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
దొరవారిసత్రం : స్థానిక రైల్వే స్టేషన్కు సమీపంలో 30ఏళ్ల నుంచి 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి చైన్నెకి వెళుతున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. స్థానిక రైల్వే సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూళ్లూరుపేట జీఆర్పీ ఎస్ఐ చెన్నకేశవ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.