
గంగమ్మకు మాజీ మంత్రుల సారె
తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకల్లో భాగంగా మంగళవారం మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ఆలయ ప్రదర్శన చేసి అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారికి ఆనవాయితీగా సారె సమర్పించి దర్శించుకున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన ఊరు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అమ్మవారి గుడికి వస్తుంటానని పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రులకు ఆలయ పండితులు అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.

గంగమ్మకు మాజీ మంత్రుల సారె