గంగమ్మకు మాజీ మంత్రుల సారె | - | Sakshi
Sakshi News home page

గంగమ్మకు మాజీ మంత్రుల సారె

May 14 2025 12:29 AM | Updated on May 14 2025 12:29 AM

గంగమ్

గంగమ్మకు మాజీ మంత్రుల సారె

తిరుపతి కల్చరల్‌ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకల్లో భాగంగా మంగళవారం మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా ఆలయ ప్రదర్శన చేసి అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారికి ఆనవాయితీగా సారె సమర్పించి దర్శించుకున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన ఊరు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అమ్మవారి గుడికి వస్తుంటానని పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రులకు ఆలయ పండితులు అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.

గంగమ్మకు మాజీ మంత్రుల సారె1
1/1

గంగమ్మకు మాజీ మంత్రుల సారె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement