
● హామీల అమలు కోసం వైఎస్సార్సీపీ కార్యాచరణ ● అక్రమ కేసు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎన్నికల ముందు సూపర్సిక్స్ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనపెట్టి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై కలసికట్టుగా పోరుబాట పట్టాలని వైఎస్సార్సీపీ నేతలు సంకల్పించారు. ఈ మేరకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశారు. సోమవారం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు, ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి, చావా రాజశేఖరరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్రెడ్డి, భూమన అభినయరెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోటి రాజేష్, విజయానందరెడ్డి, డాక్టర్ సునీల్కుమార్, వెంకటేగౌడ, భరత్కృష్ణ, రాష్ట్ర అధికారప్రతినిధి శివశంకరరెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ దగాకోరు విధానాలకు నిరసనగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం పాటించాలని, ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
వెన్నుపోటు దినం.. విజయవంతం చేద్దాం
‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నేతలు పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ల వద్ద చేపట్టే నిరసనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు,, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ అసమర్థతపై ప్రజా వ్యతిరేకత దశదిశగా ప్రతిధ్వనించేలా కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించారు. రాష్ట్రంలోని మహిళలు, రైతులు, యువత, విధ్యార్థులను పథకాల పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని స్పష్టం చేశౠరు. దగా పడిన జనానికి అండగా నిలిచి పోరాడాల్సిన భాద్యత తమ మీద ఉందని వెల్లడించారు. అందుకే ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని, సామాన్య ప్రజలను సైతం భాగస్వాములు చేయాలని సూచించారు.

● హామీల అమలు కోసం వైఎస్సార్సీపీ కార్యాచరణ ● అక్రమ కేసు