
చెరువు మట్టి..కొల్లగొట్టి
తిరుపతి రూరల్ పరిధిలోని దళవాయి చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. టిప్పర్లతో మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
కుట్రలపై న్యాయపోరాటం
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమం. ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే. కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలకు తెరలేపింది. ఆ క్రమంలోనే కాకాణి గోవర్ధన్రెడ్డి పై అక్రమ కేసులు నమోదు బనాయించింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. కూటమి అక్రమాలపై ప్రశ్నించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. న్యాయస్థానాల ద్వారానే ఈ క్రుటలపై న్యాయ పోరాటం చేస్తాం.
– డాక్టర్ గురుమూర్తి, తిరుపతి ఎంపీ
అండగా ఉంటాం
కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల గొంతు నొక్కడం బాధాకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ లేవు. కాకాణి గోవర్ధన్రెడ్డికి మేమంతా అండగా ఉంటాం. న్యాయం గెలిచేవరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తాం.
– మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ
అప్రజాస్వామికం
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం అప్రజాస్వామికం. ఆయనకు మేమంతా అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
– కిలివేటి సంజీవయ్య,
మాజీ ఎమ్మెల్యే, సూళ్లూరుపేట
డైవర్షన్ పాలిటిక్స్
ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను పక్కదారి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం.
– కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి
– 8లో

చెరువు మట్టి..కొల్లగొట్టి

చెరువు మట్టి..కొల్లగొట్టి