దైవభాష అభ్యసనం మహాదృష్టం | - | Sakshi
Sakshi News home page

దైవభాష అభ్యసనం మహాదృష్టం

Mar 26 2025 1:01 AM | Updated on Mar 26 2025 12:55 AM

తిరుపతి సిటీ: సంస్కృత భాషకు నిలయమైన ఎన్‌ఎస్‌యూలో దైవభాషను అభ్యసిస్తున్న, అధ్యయనం చేస్తున్న విద్యార్థులు అదృష్టవంతులని బెంగళూరు డీఆర్‌డీఓ ప్రముఖ శాస్త్రవేత్త ఎల్‌ఎన్‌ రాఘవేంద్ర కొనియాడారు. జాతీయ సంస్కృత వర్సిటీలో మంగళవారం వర్సిటీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రసంగించారు. సంస్కృతంలో నిక్షిప్తమైన భారతీయ సంస్కృతి ఆధునిక సమాజానికి మార్గదర్శిగా ఉందన్నారు. సంస్కృత భాష ఔన్నత్యం విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత విద్యార్థులు, అధ్యాపకులపై ఉందన్నారు. వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత అధ్యయన, అధ్యాపన విషయంలో ఉత్తమ జ్ఞానాన్ని విద్యార్థులకు, ప్రజలకు అందిస్తూ భారతీయ సంస్కృతిని, సంస్కృత భాషను సంరక్షిస్తూ ప్రాచీన భాషతో పాటు ఆధునిక సాంకేతిక విషయాలను వర్సిటీ విద్యార్థులకు నే ర్పిస్తూ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. అనంతరం పలు క్రీడా, సాంస్కృతిక పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌, కే వెంకటనారాయణరావు, డీన్లు సి దక్షిణమూర్తి శర్మ, సి రంగనాథన్‌, రజనీకాంత్‌ శుక్లా, అధ్యాపకులు నాగరాజు, ఉదయనా హెగ్డే, లీనాచంద్ర, సేతు రాం, వైష్ణవి, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూ ఏటిజిహెచ్‌ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 58,358 మంది స్వామివారిని దర్శించుకోగా 27,024 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది.

మహిళావర్సిటీలో

యూఎస్‌ కౌన్సిలేట్‌ జనరల్‌

తిరుపతి సిటీ: యూఎస్‌ కౌన్సిలేట్‌ జనరల్‌ డిప్లమసీ ఆఫీసర్‌ ఎమిలియా బి స్మిత్‌, పబ్లిక్‌ ఎంగేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ సెంథిల్‌ కుమార్‌ మంగళవారం మహిళా వర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్‌ ఉమ, రిజిస్ట్రార్‌ ర జిని, డీన్లు విజయలక్ష్మి, భారతి, శారద, అధ్యాపకులతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణపై చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వ నిధులతో త్వరలో రానున్న ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫెలో ప్రొగ్రామ్‌పై చర్చించారు. విద్యార్థులకు, రీసెర్చ్‌స్కాలర్స్‌కు, యువ అధ్యాపకులు ఉపాధి నైపుణ్యం, కమ్యూ నికేషన్‌ స్కిల్స్‌, అకడమిక్‌ రైటింగ్‌ కోసం ఇంగ్లిష్‌ భాషపై శిక్షణ ఇవ్వడానికి ఉన్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

దైవభాష అభ్యసనం మహాదృష్టం 1
1/1

దైవభాష అభ్యసనం మహాదృష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement