తూర్పుకనుమూరు తీరప్రాంతం గ్రామం.. మంగళవారం.. అక్కాచెల్లెళ్ల జాతర ప్రారంభం.. జగమంత వైభవంగా సాగింది. చెల్లెలు పోలేరమ్మ గంగమిట్టపై కొలువుదీరింది. అక్క ముత్యాలమ్మ బంగారు చీరలో దర్శనం ఇచ్చింది. ఈ వైభవం తిలకించడానికి జగమంత జనం తరలివచ్చింది.
చిల్లకూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ముత్యాలమ్మ దేవస్థానంలో మంగళవారం అమ్మవారి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. చిల్లకూరు మండల తీరప్రాంతంలోని తూర్పుకనుపూరులో గంగమిట్టపై ఉన్న పోలేరమ్మ ఆలయంలో తాత్కాలికంగా వేసిన తాటి ఆకుల గుడిసెలో పోలేరమ్మ ప్రతిమను మంగళవారం రాత్రి నిలుపుదల చేశారు. ఆదివారం ప్రారంభమైన ఘటోత్సవం కొమరావారిపాళెం, ఈదలవారిపాళెం, రావులవారిపాళెం మీదుగా తూర్పుకనుపూరునకు మంగళవారం రాత్రికి చేరుకుంది. కుమ్మరింట్లో అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేసిన అనంతరం చాకలి ఇంటికి తరలించారు. అక్కడ అమ్మవారికి దిష్టి చుక్కపెట్టి గణాచారి అనుమతితో అమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి గంగ మిట్టపై ప్రతిష్టించారు.
పక్కాగా ఏర్పాట్లు
జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో హాజరుకానుండడంతో దేవాదాయ, రెవెన్యూ, పోలీసుశాఖతో పాటు గా పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సాధారణ దర్శనంతోపాటు, ప్రత్యేక దర్శనం కోసం క్యూలు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకు నేందుకు వచ్చిన భక్తులకు దాతల సహకారంతో వా టర్ ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అలరించిన నాదస్వర కచేరి
తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ ఆలయంలోని జాతర సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నాదస్వర కచేరి భక్తులను అలరించింది. సుమారు 50 మందితో కూడిన ఈ బృందం కంచి కామకోఠి పీఠం, టీటీడీ ఆస్థాన విద్వాంసుల ఆధ్వర్యంలో నాదస్వర వాయిద్య కళాకారులు కచేరి చేశారు.
అప్రమత్తంగా వ్యహరించాలి
భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధి కారులు అప్రమత్తంగా వ్యవహరించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన సూచించారు. ఆయన జాతర నిర్వహణకు సబంధించి గతంలో సూచించిన అన్ని ఏర్పాట్లను చేశారా? లేదా అని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలీస్ అవుట్ పోస్టు, వైద్యశిబిరాలు, తాగునీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ ఉండేలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ గీతాకుమారి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ గోపి, ఆలయ ఈఓ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు.
భారీ బందోబస్తు
జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. గూడూరు డీఎస్పీ గీతాకుమారి నేతృత్వంలో గూడూరు రూరల్ సీఐ కిశోర్బాబు, ఎస్ఐ సురేష్బాబు పర్యవేక్షణలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
బంగారు చీరలో దర్శనమిచ్చిన ముత్యాలమ్మ
దేవతల్లో అక్కచెల్లెలుగా కొలిచే ముత్యాలమ్మ సన్నిధిలో తన చెల్లి పోలేరమ్మకు జరిగే జాతరలో తొలిరోజు ముత్యాలమ్మకు బంగారు చీర ను అలంకరించారు. అమ్మవారి మూల విరాట్ కు అర్చకులు ఉదయం పంచామృతాభిషేకం చే సి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దిష్టి తీర్పు తీర్చి, బంగారు చీరతో అలంకరించారు.
గంగమిట్టపై కొలువు దీరిన పోలేరమ్మ
బంగారు చీరలో దర్శనమిచ్చిన ముత్యాలమ్మ
జాతర.. జగమంత వైభవం
జాతర.. జగమంత వైభవం