ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి

Mar 25 2025 2:02 AM | Updated on Mar 25 2025 1:59 AM

కోట: గూడూరు వైపు వెళ్తున్న ఆటో నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చిట్టేడు వద్ద ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. దుగ్గరాజపట్నంకు చెందిన ఎంబేటి వెంకటయ్య(55) అనారోగ్యంతో ఆటోలో గూడూరు హాస్పిటల్‌కు వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు చిట్టేడు వద్ద ఆటో నుంచి జారి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. 108 సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుండె పోటుకు గురై ఆటో నుంచి కింద పడి ఉంటాడని 108 సిబ్బంది అనుమానిస్తున్నారు.

కళకళలాడిన వెటర్నరీ కళాశాల

తిరుపతి సిటీ:వెటర్నరీ జూడాలు ఎట్టకేలకు సమ్మె ను విరమించారు. సోమవారం నుంచి ఎస్వీ వెట ర్నరీ కళాశాల తరగతి గదులు 52 రోజుల తర్వాత తాళాలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులతో తరగతి గదులు కళకళలాడాయి.

సీ.గొల్లపల్లి సచివాలయంలో చోరీ

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం సి.గొల్లపల్లి గ్రామ సచివాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఉదయం కార్యాలయానికి చేరుకోగానే అప్పటికే తలుపులు తెరిచి ఉండడంతో లోనికి వెళ్లి పరిశీలించారు. సచివాలయంలోని ఓ ప్రింటర్‌ను అపహరించుకువెళ్లినట్టు గుర్తించారు. దీనిపై తిరుపతి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి 1
1/2

ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి

ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి 2
2/2

ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement