రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): గ్రీవెన్స్డే రోజు కలెక్టర్తోపాటు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారిచ్చే అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. అయితే రేణిగుంటలోని అధికారులు మాత్రం గ్రీవెన్స్డేనా.. అయితే మాకేంటి?.. అన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం 11.30 గంటలైనా రేణిగుంట మండల పరిషత్ కార్యాలయాని కి అధికారులు ఎవ్వరూ హాజరు కాలేదు. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చారు. సోమవారం పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసు కోవచ్చని పలువురు చర్చించుకోవడం కనిపించింది.