
శ్రీసిటీలో ‘ఓజేఐ ఇండియా’ ప్రారంభం
శ్రీసిటీ(సత్యవేడు): ఓజేఐ గ్రూపు అనుబంధ సంస్థ ఓజేఐ ఇండియా ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ శుక్రవారం శ్రీసిటీలో ప్రారంభించింది. కంపెనీ కస్టమర్లు, సరఫరాదారులు, ఇతర ప్రతినిధుల సమక్షంలో చైన్నెలోని జపాన్ కాన్సుల్ జనరల్ మునియో తకాహషి, ఓజీ హోల్డింగ్ కార్పొరేషన్ ప్రెసిడెండ్ అండ్గ్రూప్ సీఈఓ హిరోయుకి ఇసోనే, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఓటీ ఇండియా ప్యాకేజింగ్ సీఈఓ యోషియుకి కురహషి లాంచనంగా రిబ్బన్ కత్తిరించి కంపెనీని ప్రారంభించారు. దేశంలో ఇది ఐదో ప్లాంట్ కాగా, దక్షిణ భారత దేశంలో అతి పెద్దది. ఈ సందర్భంగా హిరోయుకి ఇసోనో మాట్లాడుతూ సుస్థిరత, ఆవిష్కరణల ద్వారా నిర్మించిన ఈ శ్రీసిటీ ప్లాంట్, దక్షిణ భారత దేశ ప్యాకేజింగ్ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. యోషియుకి కురహషి మాట్లాడుతూ భారత్లో ఓటీ ప్రమాణాన్ని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. జౌజీ గ్రూప్ విస్తరణ జపాన్– భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మునియో తకాహషి వ్యాఖ్యానించారు.