చిట్టమూరు:చిట్టమూరు దళితవాడకు చెందిన వైఎ స్సార్సీపీ మద్దతుదారుడు నెల్లిపూడి అన్వేష్ (సో షల్ యాక్టివిస్టు) ఎన్నికలకు ముందు పెట్టిన పోస్టింగ్లను దృష్టిలో ఉంచుకుని రెండు నెలల క్రితం పోలీసులు పిలిపించి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయన అన్ని గ్రూపుల నుంచి లెఫ్ట్ కావడంతోపాటు ఇకపై ఇలాంటి పోస్టులు పెట్టనని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాడు. అయినప్పటికీ కూటమి నాయకులు అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయ త్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీసీ రోడ్ల ని ర్మాణం పేరుతో ఆయన ఇంటిని కూల్చడానికి పూనుకున్నారు. దీంతో మండల తహసీల్దార్ కాయల సతీష్కుమార్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్ పోలీసులు శాఖ అధికారులు బందోబస్తుతో గురువారం నెల్లిపూడి అన్వేష్కు చెందిన ప్రహరీ గోడ, బాత్రూమును పూర్తిగా జేసీబీతో ధ్వంసం చేశారు. ఇదే వీధిలో ప్రహరీ గోడలున్నప్పటికీ కక్ష గట్టి అన్వేష్ ఇంటిని ధ్వంసం చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రహరిగోడను కూల్చేందుకు వచ్చిన అధికారులతో ఇంట్లో ఈ నెల 24 తేదీ సోమవారం ఓ శుభకార్యం ఉందని దీనికి పలు గ్రామాల నుంచి బంధువులు, స్నేహితులు వస్తారని ఆ కార్యక్రమం అయిన తర్వాత తానే స్వచ్ఛందంగా తొలగిస్తామన్నప్పటికీ కనికరం కూడా చూపలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.