● తొమ్మిది నెలలుగా 25 షికారీ కుటుంబాలు గ్రామ బహిష్కరణ ● వైఎస్సార్ సీపీకి ఓటేశారన్న అక్కసుతో దౌర్జన్యం ● శ్రీకాళహస్తి మండలం ఈశ్వరయ్య కాలనీలో ప్రజాస్వామ్యం ఖూనీ ● మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి గోడు వెళ్లబోసుకున్న బాధితులు
శ్రీకాళహస్తి మండలం ఈశ్వరయ్య కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇల్లు
ఒడిశాలో తలదాచుకుని తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్న బాధితులు(ఫైల్)
చంటి బిడ్డలు.. చదువుకునే పిల్లలు.. వయో వృద్ధులు.. గ్రామ ప్రథమ పౌరులు వారా వీరా అనేమీ.. ఆ కాలనీలోని గిరిజనమంతా ఊరు విడిచింది.. భాషకానీ భాష.. రాష్ట్రం కానీ రాష్ట్రానికి పొట్ట చేతపట్టుకుని వెళ్లింది. బిక్కుబిక్కుమంటూ 9 నెలలుగా కాలం గడుపుతోంది.. మళ్లీ మా స్వస్థలం చేరుతామో లేదోనన్న బెంగతో బతుకుతోంది. దీనంతటికీ కారణమేమిటంటే.. ఆ గిరిజనులు వైఎస్సార్ సీపీకి ఓటు వేయడమే. ఓటేసిన పాపానికి పచ్చనేతలు ఆ గిరిజనాన్ని బెదిరించి.. గ్రామ బహిష్కరణ చేయించారు. అయినా ఏ ఒక్కరూ నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఆ గిరిజనం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.
రేణిగుంట: వైఎస్సార్ సీపీకి ఓట్లేశారన్న అక్కసుతో ఆ గ్రామానికి చెందిన పచ్చనేతలు 25 గిరిజన కుటుంబాలను గ్రామం నుంచి వెళ్లగొట్టారు. ఇక్కడే ఉంటే చంపేస్తామని బెదిరించారు. దౌర్జన్యం చేశారు. చేసేది లేక, గత ఏడాది జూన్ 7వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపేడు పంచాయతీ ఈశ్వరయ్య కాలనీకి చెందిన 25 గిరిజన కుటుంబాలు గ్రామాన్నే కాదు.. రాష్ట్రాన్నే వీడారు. ఒడిశా రాష్ట్రానికి వెళ్లి తలదాచుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దుబ్బాక, మరి కొన్ని ప్రాంతాల్లో పరాయిపంచన బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
గ్రామ ప్రథమపౌరురాలినే తరిమేశారు
గత ప్రభుత్వ హయాంలో ఈశ్వరయ్య కాలనీకి చెందిన షికారీ మహిళ సుమతి గ్రామసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడమే కాలనీలోని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన 25 గిరిజన కుటుంబాలను గ్రామానికి చెందిన టీడీపీ బడానేత చంపేస్తామని బెదిరించి, గ్రామం నుంచి తరిమేశారు. ఊరొదిలి వెళ్లిపోయిన వారిలో గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు సైతం సర్పంచ్ ప్రమేయం లేకుండానే టీడీపీ నేతలే అన్నీ తామై పంచాయతీ పాలనను కొనసాగిస్తూ.. స్థానిక సంస్థల హక్కులను అపహాస్యం చేస్తున్నారు.
మానవ హక్కుల ఉల్లంఘన
ఎస్టీ కులానికి చెందిన 25 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తే ప్రజా సంఘాలు కానీ, దళిత, గిరిజన సంఘాలు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. గొంతెత్తి ప్రశ్నించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి విన్నవించినా పట్టించుకోలేదు.
మాజీ సీఎం వైఎస్జగన్ను కలసిన బాధితులు
పచ్చనేతలకు భయపడి ఊరొదిలి వెళ్లిన 25 గిరిజన కుటుంబాలు గురువారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తమ గోడును ఆయనతో పంచుకున్నారు. అండగా నిలుస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.
కమిషన్ కలుగజేసుకోవాలి
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక, ప్రతిపక్ష పార్టీలతోపాటు, సామాన్యులైన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, బడుగు, బలహీన వ ర్గాలకు చెందిన పేద, సామాన్య ప్రజలే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎంపేడు ఈశ్వరయ్య కాలనీలో 25 కుటుంబాలు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లిపోయేలా చేశారు. 9 నెలలు గా వారంతా బయటి రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని మగ్గుతున్నారు. కాలనీలో వాళ్ల ఇళ్లన్నీ తాళాలు వేసి బోసిపోయి ఉన్నాయి. మానవహక్కుల కమిషన్ బాధితులకు న్యాయం చేయాలి.
– డాక్టర్ మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి
చాలా దుర్మార్గం
ఈశ్వరయ్య కాలనీకి చెందిన షికారీలను ఊళ్లో నుంచి వెళ్ల గొట్టడం చాలా దుర్మార్గం. అధికార యంత్రాంగం ఏక పక్షంగా వ్యవహరిస్తూ చిగురుటాకులపై ప్రతాపం చూపి నిమ్నజాతులను హింసించడం తగదు. మానవహక్కుల కమిషన్ ఈ ఘటనపై కలుగజేసుకుని బాధితులకు న్యాయం చేయాలి.
– కె.హరినాఽథ్, గిరిజన సంఘ నేత, తిరుపతి జిల్లా
చిగురుటాకులపై ప్రతాపం
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చాలా దారుణంగా ప్రతీకార దాడులకు తెగబడుతున్నారు. 9 నెలలుగా ఎంతోమందిపై భౌతిక దాడులు చేశారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, తిరిగి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపైనే అక్రమ కేసులు బనాయించి హింసిస్తున్నారు. ఎంపేడు ఈశ్వరయ్య కాలనీలోని 25 షికారీ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తే.. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. బాధితులను మళ్లీ వాళ్ల ఇళ్లకు చేర్చి భరోసా కల్పించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. – బియ్యపు మధుసూదన్రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి
ఊరికి దూరంగా..
ఊరికి దూరంగా..
ఊరికి దూరంగా..
ఊరికి దూరంగా..
ఊరికి దూరంగా..
ఊరికి దూరంగా..