మృత్యువుతో పోరాడి ఓడిన అంగన్‌వాడీ కార్యకర్త | - | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి ఓడిన అంగన్‌వాడీ కార్యకర్త

Mar 20 2025 2:04 AM | Updated on Mar 20 2025 2:03 AM

● ఈనెల 10న విజయవాడలో శ్రీవాణికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ ● చికిత్స పొందుతూ బుధవారం మృతి

నాగలాపురం: పిచ్చాటూరుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త శ్రీవాణి మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఆమె కన్నుమూశారు. వివరాలు.. ఈ నెల 10 వ తేదీ రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు ధర్నా నిమిత్తం పిచ్చాటూరుకు చెందిన శ్రీవాణి విజయవాడకు వెళ్లారు. అక్కడ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళుతుండగా ఆమెకు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రి పాలయ్యారు. కొన్నాళ్లు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత తిరుపతి స్విమ్స్‌కు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స పదిరోజులుగా శ్రీవాణి శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ఆమె మరణించినట్లు బుధవారం మధ్యాహ్నం డాక్టర్లు ప్రకటించారు. ఆమె మృతికి సహచర అంగన్‌వాడీ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గేట్‌లో ఎస్వీయూ విద్యార్థినికి 78వ ర్యాంకు

తిరుపతి సిటీ : దేశ వ్యాప్తంగా బుధవారం విడుదల చేసిన గేట్‌ ఫలితాల్లో ఎస్వీయూ ఫిజిక్స్‌ విభాగానికి చెందిన పీజీ విద్యార్థిని బి.కీర్తి జాతీయ స్థాయిలో 78వ ర్యాంక్‌ సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె వర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో పొటానిక్స్‌ ప్రత్యేక అంశంగా అధ్యయనం చేశారు. ప్రొఫెసర్‌ బి.దేవప్రసాద్‌ రాజు ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. గేట్‌ పరీక్షల్లో ర్యాంకు పొందడం ద్వారా జాతీయ స్థాయి యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసే అవకాశం దక్కింది. ఆమె అధ్యాపకులు, అధికారులు అభినందించారు.

స్థూల ఆర్థిక విశ్లేషణపై అవగాహన సదస్సు

తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం, న్యాయశాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలో బుధవారం నిత్య జీవితంలో స్థూల ఆర్థిక విశ్లేషణ సూచికలు, ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. హరిసింగ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకట మునిరెడ్డి ( మధ్యప్రదేశ్‌) ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో స్థూల ఆర్థిక సూచికలైన స్థూల జాతీయోత్పత్తి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, వడ్డీ రేటు, గత ఐదేళ్లలో చోటుచేసుకున్న మార్పులను విశ్లేషించారు. అలాగే వినియోగదారుల విశ్వాస సూచిక, మాన్యుఫ్యాక్చరింగ్‌ సూచికను ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ మాధురి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మృత్యువుతో పోరాడి ఓడిన అంగన్‌వాడీ కార్యకర్త 1
1/2

మృత్యువుతో పోరాడి ఓడిన అంగన్‌వాడీ కార్యకర్త

మృత్యువుతో పోరాడి ఓడిన అంగన్‌వాడీ కార్యకర్త 2
2/2

మృత్యువుతో పోరాడి ఓడిన అంగన్‌వాడీ కార్యకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement