రొయ్యల సాగు కష్టం | - | Sakshi
Sakshi News home page

రొయ్యల సాగు కష్టం

Mar 20 2025 2:03 AM | Updated on Mar 20 2025 2:02 AM

నేడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకునే వాడిని. గత ఏడాది ఉద్యోగం వదిలి సొంతంగా నా భూమితోపాటు కొంత కౌలుకు తీసుకుని రొయ్యలు సాగు చేపట్టా. తీరా పట్టుబడి వచ్చే సమయానికి రోజూ కౌంటు మీద రూ.10 తగ్గించేస్తున్నారు. దీని వల్ల రూ.లక్షల్లో నష్టం వచ్చింది. రొయ్యల సాగుకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్న ధరలను కూడా అదుపు చేయలేకపోయింది. ఒక్క నెలలోనే కౌంటుకు రూ.50 వరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో రొయ్యల సాగు కష్టంగా మారింది. – సన్నారెడ్డి విజయులురెడ్డి, ఆక్వా రైతు, శింగనలత్తూరు, చిట్టమూరు మండలం

ఖర్చులు పెరిగిపోయాయి

నాకు ఏడు గేదెలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే పాలను ప్రైవేట్‌ డెయిరీకి విక్రయించి కుటుంబానికి అండగా ఉంటున్నా. గత ఏడాది వేసవిలో లీటరు పాలకు రూ.70 వరకు వచ్చేది. ఈ ఏడాది సరాసరి రూ.60లకు తగ్గించేశారు. వెన్నశాతం తగ్గిపోయిందని సాకులు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గేదెలకు పచ్చి మేత, ఎండుగడ్డి, దాణాల ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి, వీటిని భరించడం కష్టంగా ఉంది. దీంతో చాలామంది పాడి రైతులు చేసేదిలేక గేదెలను అమ్మేస్తున్నారు. – మస్తానమ్మ, పాడి రైతు, చిట్టమూరు

ఫలితం లేదు

నాకు రెండు ఎకరాల పొలం ఉంది. అందులో ఏటా పుచ్చ సాగు చేపడుతుంటా. ఈ ఏడాది కూడా ధరలు బాగా ఉంటాయని పుచ్చ సాగు చేశా. ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి కింద ఖర్చు పెట్టా. దిగుబడి బాగానే వచ్చింది. కష్టాలు తీరిపోతాయిలే అనుకుంటే కాయలకు రేటు తగ్గిపోయింది. మార్కెట్‌లో కేజీ రూ.10లకు అడుగుతున్నారు. గత ఏడాది రూ.15 పలకడంతో ఆదాయం వచ్చింది. ఇప్పుడు కష్టమే మిగిలింది. ఫలితం లేకుండా పోయింది. – పోలిచెర్ల రమణమ్మ, పుచ్చరైతు, ఏరూరు, చిల్లకూరు మండలం

రొయ్యల సాగు కష్టం 
1
1/2

రొయ్యల సాగు కష్టం

రొయ్యల సాగు కష్టం 
2
2/2

రొయ్యల సాగు కష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement